సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం, ముషిపట్ల గ్రామంలో.. ఓ గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదపుశాత్తు మోకు జారింది. దాంతో.. గీతకార్మికుడు పాపయ్య తాటిచెట్టుపై తలకిందులుగా వేలాడాడు. ఇలా సుమారు రెండు గంటల పాటు నరక యాతన అనుభవించాడు. బాధితుడి కేకలు విన్న స్థానికులు.. గ్రామంలో జేసీబీ సహాయంతో.. తాటి చెట్టు మీద నుంచీ సురక్షితంగా కిందికి దించారు. స్థానికుల అప్రమత్తతతో పాపయ్య సేఫ్ అయ్యాడు. వారందరికీ బాధితుడు కుటుంబం ధన్యవాదాలు తెలిపింది
===========