సిరాన్యూస్,చిగురుమామిడి
కాంగ్రెస్తోనే రైతు సంక్షేమం: జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్
* సజావుగా కొనసాగిన కోనుగోలు కేంద్రాలు
కాంగ్రెస్తోనే రైతు సంక్షేమం సాధ్యమవుతుందని జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు చిగురుమామిడి మండలంలోని ముల్కనూరు పీచుపల్లి గ్రామాల్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని శనివారం ఆయన పరిశీలించారు.రైతులు అధైర్యపడవద్దని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. మండలంలో మూడు సెంటర్ లల్లో తప్ప పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు పూర్తయిం దన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ రైతులపై కపట ప్రేమ చెపుతున్నాయన్నారు. నల్ల చట్టాలతో రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర బీజేపీది అని అన్నారు. ప్రభుత్వం త్వరలో రైతు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమములో గ్రామ శాఖ అధ్యక్షులు పూదరి వేణు,గజ్జెల రాములు, ముస్కు ప్రభాకర్ రెడ్డి, పైడిపెల్లి సతీష్, మర్రి శ్రీనివాస్, గుళ్ల సదానందం, గట్టు ప్రశాంత్, కల్వల రాజేశ్వర్ రెడ్డి, పైడిపెల్లి చంద్రయ్య, నవీన్, మధు సిలువెరీ రాజు తదితరులు పాల్గొన్నారు.