సిరా న్యూస్, బేల:
డిగ్రీ విద్యకు కేరాఫ్ అడ్రస్గా ‘కీర్తన డిగ్రీ కళాశాల’
+ వందలాది మందిని గ్రాడ్యుయేట్లుగా తీర్చిద్దిన కళాశాల
+ 200+ మంది పీజీ ర్యాంకర్లతో హవా
+ ఉత్తర తెలంగాణలో ప్లే స్టోర్ ఆప్ కలిగిన మొదటి కళాశాలగా కీర్తి
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో 2015లో వాగేశ్వరీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థాపించిన ‘కీర్తన డిగ్రీ కళాశాల’ అంచెలంచెలుగా ఎదుగుతూ డిగ్రీ విద్యకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. మారుమూల గ్రమాల్లోని గిరిజన, నిరుపేద, వెనుకబడి విద్యార్థులకు నాణ్యమైన డిగ్రీ విద్యను అందించాలనే లక్ష్యంతో బేల మండల కేంద్రంలో ప్రారంభించిన ఈ కళాశాల ఇప్పటికే వందలాది మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దింది. నిరుపేదలకు ఉన్నత విద్య భారంగా మారకూడదనే సంకల్పంతో నామ మాత్రపు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యార్థులను మన్ననలను పొందుతున్న కీర్తన డిగ్రీ కళాశాలపై ప్రత్యేక కథనం…
ఎన్నో ప్రత్యేకతలు…
పవన్ కుమార్ అగర్వాల్ చైర్మెన్గా, డా. వరప్రసాద్ రావ్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్న ఈ కళాశాల అనతి కాలంలోనే ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. రెండంతస్తుల స్వంత భవనంతో పాటు మంచి అనుభవం, నిబద్దత, నైపుణ్యాలు గల అధ్యాపకులు ఈ కళాశాల స్వంతం అని చెప్పవచ్చు. బీ.ఏ., బీఎస్సీ, బీకాంలలో విభిన్నమైన కోర్సులను ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో అందిస్తుండటం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కాకతీయ విశ్వవిద్యాలయం అనుబంధంతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ కళాశాల ఇప్పటికే 200లకు పైగా విద్యార్థులను వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ ర్యాంకర్లుగా నిలిపింది. దీంతో పాటు వందలాది మందిని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఈ కళాశాల ప్రస్తుతం న్యాక్ అక్రిడేషన్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.
విద్యార్థులకు కోసం ప్లేస్టోర్లో ఆప్…
కళాశాలలో చెప్పిన పాఠాలను విద్యార్థులు తమకు వీలున్నప్పుడల్లా వినేలా కళాశాల యాజమాన్యం ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ను రూపొందించింది. కరోనా కష్టకాలం విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన యాజమాన్యం వారికి ఆన్లైన్లో పాఠాలు బోధించాలనే సంకల్పంతో ఏకంగా ‘కీర్తన డిగ్రీ కాలేజ్ బేల’ పేరిట గూగుల్ ప్లే స్టోర్లో ఆప్ను పొందుపరిచింది. ఈ ఆప్లో కేవలం ఆన్లైన్ క్లాసులే కాకుండా కళశాల సమాచారం, కాకతీయ యూనివర్సిటీ రిజల్ట్స్, కోర్సుల వివరాలను సైతం అందుబాటులోకి తేవడంతో ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
నిరుపేదలకు నాణ్యమైన విద్య…
మారుమూల గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులకు కార్పోరేటుకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నాము. ఇప్పటికే వందలాది మందిని గ్రాడ్యుయేట్లుగా, 200లకు పైగా మందిని వివిద విశ్వవిద్యాలయాల్లో పీజీ ర్యాంకర్లుగా తయారు చేసాం. ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులకు వీలుగా గూగుల్ ప్లేస్టోర్లో ప్రత్యేకమైన ఆప్ను తయారు చేసాం. విద్యార్థులకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఈ ఆప్ను వాడుకునే వెసులుబాటు కల్పించాము. దోస్త్ అడ్మిషన్లలో మా కళాశాలను ఎంపిక చేసుకోవడంతో విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9493384999 నంబర్ను సంప్రదించవచ్చు.
====================================
మొబైల్ ఆప్ లాంచింగ్ పేజ్…
===================================
కళాశాల అందిస్తున్న కోర్సుల వివరాలు