ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం

సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం రూరల్ మండల పర్యటన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గోన్నారు.మంత్రి మాట్లాడుతూ మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచినా. తెలంగాణాలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం. గ్రామంలో ఉన్న పాఠశాల,రోడ్లు,కమ్యూనిటీ హల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తాం. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తాం. పాలేరు నియోజకవర్గం నా సొంత ఇల్లు. ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయి. అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తా. ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత నాది. భవిష్యత్ లో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా నాకు తెలియచేయండి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీ పెద్ద కొడుకు గా పనిచేస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *