సిరాన్యూస్, బోథ్
మార్కెట్ యార్డు భారీగా తరలివచ్చిన జొన్న పంట
ఆదిలాబాద్ జిల్లా బోధ్ మార్కెట్ యార్డుకు సోమవారం భారీగా జొన్న పంట తరలివచ్చింది. అయితే 20వ తేదీ నుండి 24 వరకు మార్కెట్ యార్డులో జొన్న పంట కొనుగోలు నిలిపివేస్తామని సెంటర్ ఇన్చార్జి గోలి స్వామి తెలిపారు. ఆ సమాచారం రైతులకు చేరకపోవడంతో భారీ సంఖ్యలో జొన్న పంటలు తీసుకొని వాహనాలు వచ్చాయి. అయితే చివరికి మార్కెట్ కమిటీ అధికారులు చైర్మన్ జోక్యంతో బయట ఉన్న వాహనాలను లోనికి అనుమతించారు. అయితే మంగళవారం ఎవరు కూడా మార్కెట్కు జొన్నలను తీసుకురావద్దని తెలిపారు.