సిరా న్యూస్,అమలాపురం;
అమలాపురంలో వైద్యులు మహిళ కడుపులో 570 రాళ్లను అరుదైన సర్జరీతో తొలగించారు. గాల్స్టోన్స్ సమస్య తో ఆసుపత్రిలో మహిళ దేవగుప్తం కు చెందిన జాలెం నరసవేణి (31) జాయిన్ అయింది. మహిళ తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో అత్యవసరంగా ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్సచేసారు. మహిళ కడుపులో ఉన్న 570 రాళ్లు తొలగించారు. ఇన్ని వందల సంఖ్యలో రాళ్లు ఉండటం చాలా అరుదు అంటున్న డాక్టర్లు,మహిళ కూ ప్రాణాపాయం లేదని అన్నారు.