సిరాన్యూస్,చిగురుమామిడి
దీక్షాపరులతో కిటకిటలాడిన శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం
* పెద్ద ఎత్తున భక్తుల రాకతో కాషాయమైన ఆలయం
* వేగంగా దిన దిన అభివృద్ధి చెందుతున్న ఆలయం
* ఆలయ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యం కావాలంటున్న ఆలయ ధర్మకర్తలు
కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతున్నటువంటి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి శ్రీస్వయంభు పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్య క్షేత్రంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ పూజ్య గురు హూమేష్ స్వామీజీ చేతుల మీదుగా సోమవారం హనుమాన్ ఏకాదశ మండల దీక్షాపరులు అధిక సంఖ్యలో విచ్చేసి మాలా దీక్ష స్వీకరించారు..దాదాపు 500పై చిలుకు హనుమాన్ భక్తులు మాలా దీక్ష స్వీకరించేందుకు రావడంతో ఆలయం కాషాయమైంది. ఆలయ పరిసరాలు ఎటు చూసినా హనుమాన్ భక్తులతో కిటికీలాడుతూ మరో కొండగట్టును తలపించింది.కరీంనగర్,వరంగల్, సిద్దిపేట ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో ఆలయం వేగంగా దినదిన అభివృద్ధి చెందుతుంది. శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన సాగుతుందని,ఆలయ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యం కావాలని తోచిన సహాయం అందజేయాలని ఆలయ ధర్మకర్తలు కోరుతున్నారు.ఆలయంలో ప్రతిరోజు స్వాములకు బిక్షను సైతం ఏర్పాటు చేస్తున్నారు.