Mallaram: మల్లారంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

సిరా న్యూస్, భీమదేవరపల్లి
మల్లారంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో మంగ‌ళ‌వారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్య‌క్ర‌మంలో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రాజిరెడ్డి, భీమదేవరపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నారగోని నరేందర్ గౌడ్, మల్లారం గ్రామ శాఖ అధ్యక్షులు పాత పెళ్లి సంపత్, సీనియర్ నాయకులు నాగిళ్ళ సారయ్య, గుజ్జ రాజేశ్వర్ రావు, గోపగోని లింగయ్య, రంగు రాజు, బర్రె రమణ రెడ్డి, గూడెల్లి ధర్మేందర్ రెడ్డి, చాడ రత్నాకర్ రెడ్డి, ఒద్దుల సంపత్, రంగు రాజు, బర్రె రాజిరెడ్డి, గుజ్జ శ్రీనివాస్ రావు, బర్రె సురేందర్ రెడ్డి , కన్నబోయిన రమేష్, అరికాల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *