సిరా న్యూస్, చిగురుమామిడి
రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి
* కాంగ్రెస్ మండల నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ బడుగు ,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దేశ మాజీ ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని తెలిపారు. నెహ్రూ ఇందిరా రాజీవ్ గాంధీ ల సేవలు దేశ ప్రజలు మర్చిపోలేరన్నారు. ఆయన అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల రవీందర్ , జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, పలు గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మల్లికార్జున్ రెడ్డి, చింతపూల నరేందర్, లక్ష్మణ్, వంగ కనకయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి యాదగిరి, కిసాన్ సెల్ అధ్యక్షుడు కాంతాల మైపాల్ రెడ్డి,నాయకులు పోటు మల్లారెడ్డి, సాంబార్ బాబు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.