మురికి కంపుతో విరాజిల్లుతున్న ఎంఎంటీఎప్ స్టేషన్

సిరా న్యూస్,హైదరాబాద్;
ఎంతో పచ్చదనం, పారిశుద్ధ్యం నిర్వహణతో కళకళలాడాల్సిన బోరబండ రైల్వే స్టేషన్ పరిసరాలు మురికి కంపు వెదజల్లుతూ ప్రయాణికులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బోరబండ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నుండి నిత్యం వందల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. కానీ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలంటే చెత్త కుప్పల మీద నడిచి వెళ్లాల్సిన దుస్థితి నేడు నెలకొంది. ఒకప్పుడు బోరబండ రైల్వే స్టేషన్ వరకు బస్సు సౌకర్యం ఉండేది. అది కాస్త బంద్ కావడంతో ప్రయాణికుల కోసం వేసిన షెల్టర్లు సైతం పాడైపోయాయి. అల్లాపూర్ డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో మచ్చుకైన పరిసరాలు పరిశుభ్రంగా లేవు. స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెత్తను పడేయడంతో పాటు, కొంతమంది చిరు వ్యాపారుల సైతం వారి వద్ద వెలువడే చెత్తను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పడి వేయడంతో పరిసరాలు పూర్తిగా దుర్గంధ మయం అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టి ఎంఎంటిఎస్ లో ప్రయాణించే వారి సౌకర్యార్థం చెత్తకుప్పలను తరలించడంతోపాటు దీనికోసం ఒక శాశ్వత పరిష్కారం మార్గాన్ని చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *