వర్షాకాలంలో శానిటేషేన్ పై అప్రమత్తంగా ఉండాలి

వేసవిలో తాగునీటి సరఫరా సక్సెస్ పై మంత్రి అభినందన
రానున్నరోజుల్లో ఇలాగే పని చేయాలి
అధికారులకు పంచాయతీరాజ్ శాఖా మంత్రి సీతక్క అదేశం
సిరా న్యూస్,హైదరాబాద్ ;
వేసవిలో ఇబ్బందులు లేకుండా అన్ని గ్రామాలకు, ఆవాసలకు తాగునీటి సరఫరా చేయడం పట్ల పంచాయతీరాజ్, మిషన్ భగీరథ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ లో పీఆర్, ఆర్డి, మిషన్ భగీరథ అధికారులతో మంత్రి సీతక్క సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా త్రాగునీటి సరఫరా అధికారుల పని తీరు అభినందనీయమని మంత్రి అన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే పనితీరు ప్రదర్శిస్తూ ప్రజలకు ఇబ్బంది పడకుండా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో త్రాగునీరు కాలుష్యం కాకుండా, డ్రైనేజీ పైపులు లీకేజీ లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.వర్షాకాలంలో గ్రామపంచాయతీల్లో శానిటేషన్ పై జాగ్రత్తగా ఉండాలని, డ్రైనేజీలు, రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఈఎన్సిలు కృపాకర్ రెడ్డి, కనకరత్నం, కమిషనర్ అనిత రామచంద్రన్, విద్యాసాగర్, కాత్యాయని ఇతర అధికారులు పాల్గొన్నారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *