ఆసుపత్రిలో చెట్టు కూలి భర్త మృతి..భార్యకు తీవ్రగాయాలు

సిరా న్యూస్,సికింద్రాబాద్;
బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆస్పత్రి ఆవరణలో ఉన్న భారీ వృక్షం విరిగి పడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య సరళ దేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి కి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సరళ దేవికి సైతం తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిగా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి కి తరలించారు. సరళ దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒకసారి తో ఈ ఘటన మూలంగా ఆసుపత్రికి వచ్చిన వారంతా ఆందోళన గురయ్యారు.
============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *