Sesha Rao: మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పడాలి: డీపీఎం శేషారావు

సిరాన్యూస్, బోథ్‌
మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పడాలి: డీపీఎం శేషారావు

మహిళా సంఘాలను మరింత ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో సీసీల పాత్ర కీలకమని ఇందిరా క్రాంతి జిల్లా ప్రత్యేక అధికారి, డీపీఎం శేషారావు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలోని కార్యాలయంలో వివిధ గ్రామాల మహిళా సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రతినెల తప్పనిసరిగా పొదుపు ఖాతాలను పరిశీలించాలని సూచించారు. పొదుపుతో పాటు ఆర్థిక అభివృద్ధి కోసం చేపడుతున్న వృత్తి వ్యాపారాలను పరిశీలించాలన్నారు. మరోవైపు ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే మహిళా సంఘాలకు పాఠశాల విద్యార్థుల డ్రస్సులను కుట్టించి ఇచ్చే బాధ్యతను అప్పజెప్పాలని ఉంద‌న్నారు. అంతేగాక భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను డ్వాక్రా మహిళలకు అప్పజెప్పే ఆలోచనలో ఉందన్నారు. సమావేశంలో ఎంపీడీవో రమేష్ ,ఏపీఎం మాధవ్, సీసీలు, మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *