శ్రీ చైతన్య స్కూలు సీజ్

 సిరా న్యూస్,మేడ్చల్;
ఎటువంటి అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య స్కూల్ ను యాజమాన్యం ప్రారంభించింది. దాదాపు 160 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్స్ పేరిట డబ్బులు వసూలు చేసారు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఈ అడ్మిషన్లు జరిగాయి. కనీస ఫీజు 2024 2025 విద్యా సంవత్సరానికి రూ. లక్ష 30 వేల రూపాయలు. పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరిస్తున్నా కనీస అనుమతులు లేకుండా పాఠశాల ఓపెన్ అంటూ పాంప్లెట్లు పంచి అడ్మిషన్లు అంటూ ప్రచారం చేసారు. సుచిత్ర సమీనంలో ఏర్పాటు చేసి .అడ్మిషన్లు స్వీకరిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ పై విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. శ్రీ చైతన్య స్కూల్ వ్యవహారంపై కుత్బుల్లాపూర్ విద్యాశాఖ మండల అధికారి వసంతకుమారి సీజ్ చేసారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *