సర్వాయిపాలెం గ్రామస్థులను అస్వస్థత

 సిరా న్యూస్,కావలి;
నెల్లూరు జిల్లా : కావలి రూరల్ (మం) సర్వాయిపాలెం పంచాయితీ మాతినవారిపాలెంలో భయానక పరిస్థితి నెలకొంది. గ్రామస్తులు నీళ్ల విరోచనాలతో పదుల సంఖ్యలో నెల్లూరు కావలి ఆసుపత్రుల్లో చికిత్స న్నారు. పెద్ద ఎత్తున ప్రజలు అస్వస్థకు గురవుతుండడంతో రెండు రోజులుగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసారు. గ్రామంలో పైప్ లైన్ లీకేజ్ అయిపేడ దిబ్బలతో నీరు కలుషితమవడం వల్లనే గ్రామస్తులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. పైప్ లైన్ లో మరమ్మతులపై ఎన్నిసార్లు సచివాలయంలో మొరపెట్టుకున్న అధికారులు స్పందించలేదని బాధితులు ఆరోపించారు. అపరిశుభ్రంగా ఉన్న వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాలను సిబ్బంది గురువారం నాడు ఈరోజు శుభ్రపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *