Amrita Rao: బుద్ధుడు చూపించిన మార్గంలో నడవాలి: మండల అధ్యక్షులు అమృత రావు

సిరా న్యూస్, బోథ్‌
బుద్ధుడు చూపించిన మార్గంలో నడవాలి: మండల అధ్యక్షులు అమృత రావు

బుద్ధుడు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని బౌద్ధ సొసైటీ మండల అధ్యక్షులు అమృత రావు అన్నారు. బుద్ధుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాల గ్రామంలో అంబేద్కర్ సంఘం బౌద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వ‌హించారు.ఈ సందర్భంగా బౌద్ధ విహార్ లో పంచశీల పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుద్ధుడు జ్ఞానమార్గం మాధ్యమార్గం అష్టాంగ మార్గం ద్వారా ప్రజలను సత్య అన్వేషణ వైపు కొనసాగించారన్నారు. కోరికలతో దుఃఖం కష్టం ఉంటుందని కోరికలను జయించినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుందన్నారు. బౌద్ధమతం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో విస్తరించిందన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు భగత్ ప్రవీణ్ ప్రధాన కార్యదర్శి కె లక్ష్మణ్ భక్తుల, రమేష్ మద్దెల మహేష్ సోమన్న, కిరణ్ స్వామి, రాహుల్, రాజారామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *