Rajarshi Shah: మే 31లోగా మ‌ర‌మ్మ‌త్తు ప‌నుల‌ను పూర్తి చేయాలి: క‌లెక్ట‌ర్‌ రాజర్షి షా

సిరాన్యూస్, ఆదిలాబాద్
మే 31లోగా మ‌ర‌మ్మ‌త్తు ప‌నుల‌ను పూర్తి చేయాలి: క‌లెక్ట‌ర్‌ రాజర్షి షా

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ లో భాగంగా చేపడుతున్న మరమ్మత్తు పనులను మే 31లోగా పూర్తిచేయాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అధికారులను ఆదేశించారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం లో ఏర్పాటు చేసిన అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ రివ్యూ మీటింగ్ సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈసంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ అమ్మఆదర్శ పాఠశాల కమిటీ కి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకొని పాఠశాలల రూపురేఖలు మార్చాలని అన్నారు . ప్రభుత్వ పాఠశాల, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లలో టాయిలెట్స్ మరమ్మత్తులు, పెయింటింగ్, మౌళిక వసతుల పనులన్నీ నాణ్యతగా ఉండాలని సూచించారు. వర్షాలు కురిసే సమయాల్లో లీకేజీలు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో చేపడుతున్న పనులన్నింటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అత్యవసరమైన పనులను గుర్తించి వాటిని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ మండలం లోని అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ల ద్వారా ఎక్కడెక్కడ రేపర్స్, మేజర్ పనులు అవసరమో ఆ వివరాలు సమర్పించడం జరిగిందని దానికనుగుణంగా పనులు చేపట్టాలని, ఇంకా పనులు ప్రారంభించని చోట త్వరగా ప్రారభించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపిఓ, ఈఈ, ఎం ఈ ఓ, ఏ పి ఎం లు టీమ్ గా వెళ్లాలని ఆన్నారు. ఈజీఎస్‌లో చేపడుతున్న పనుల పై దృష్టి సారించాలని, ముఖ్యంగా టాయిలెట్స్ మరమ్మత్తులు, నిర్మాణ పనుల పై డిపిఓ, సీఈఓ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పనులలో నిర్లక్ష్యం వహించిన, గడువులోగా పనులు జరగకపోతే సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ అధికారి ప్రణీత, డీపీఓ , డీఎల్‌పీఓస్ , డీడీటీడబ్ల్యూ , ఎంఈఓ ఎస్‌, పెయింటింగ్స్ ఏజెన్సీస్, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ లు, ఎంపీఓ, ఈఈ లు, డీఈఈ లు, ఏఈఈ లు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *