సిరా న్యూస్,కరీంనగర్;
జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు మెదక్ పార్లమెంటు పరిధిలోకి గల కౌంటింగ్ కేంద్రం నర్సాపూర్ బివిఆర్ ఐటి కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం, హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కౌంటింగ్ సూపర్వైజర్లు 79 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లను 80 మంది మొత్తం 159 మందిని నియమించినట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో జిల్లా మాస్టర్ ట్రైనర్ అధికారి అయోధ్య రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ గురించి క్లుప్తంగా వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.
లోకసభ పోలింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించినందుకు అందరినీ అభినందించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ప్రకారం కౌంటింగ్ సెంటర్లలో కౌంటర్లవారీగా ప్రతి సూపర్వైజర్ మిషన్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా నియోజకవర్గ ఏఆర్ఓ ను మాత్రమే సంపాదించాలి. కౌంటింగ్ ప్రక్రియలో నిర్వహణలో సూపర్వైజర్ల పాత్ర కీలకం ఇందుకోసం కౌంటింగ్ పక్రియ గురించి అవగాహన కలిగి ఉండాలి. కౌంటింగ్ ప్రక్రియ సైతం ఎటువంటి పొరపాట్లు జరగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్, జిల్లా ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ డిపిఓ,దేవకీదేవి మరియు జిల్లా మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.