ట్రాయ్ పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ తో జాగ్రత్త ఉండాలి..

సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలి..

ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ నెంబర్ బ్యాంకు వివరాలు ఆధార్ కార్డు వివరాలు ఇతరులకు తెలియపరచకూడదు..

అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాల బారి నుండి తప్పించుకోవచ్చు.

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ

 సిరా న్యూస్,సిద్దిపేట;
తెలంగాణ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టి ఆర్ఏఐ, పేరుతో ఫేక్ కాల్స్ మెసేజ్ లు వస్తున్నాయి ఫోన్స్ సిమ్ కార్డు బ్లాక్ అవుతున్నాయంటూ కాల్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని నమ్మవద్దు.
గుర్తు తెలియని వ్యక్తి మరియు గుర్తుతెలియని నెంబర్ ద్వారా ఫోన్ చేస్తే ఎవరూ కూడా రెస్పాండ్ కావొద్దు.
అత్యవసరం అయితే తప్ప పిల్లలకు ఫోన్ కొనివ్వవద్దు.
పిల్లలు యువకులు ఫోన్లలో ఏం చేస్తున్నారు.? ఏం డౌన్లోడ్ చేస్తున్నారో తప్పకుండా గమనిస్తూ ఉండాలి.
ఆన్లైన్ గేమ్స్ రమ్మీ ఇతర తదితర గేమ్స్ డౌన్లోడ్ చేసి బెట్టింగ్ పాల్పడి తల్లిదండ్రులకు తల్లిదండ్రులను లేనిపోని ఆర్థిక ఆర్థికంగా దిగజారుస్తున్నారు.
ఏమీ చేయలేని పరిస్థితుల్లో జీవితంపై విరక్తి చెంది ఒత్తిడికి లోనై బ్యాలెన్స్ తప్పి ఆత్మహత్య చేసుకుంటున్నారు.
టెక్నాలజీ చాలా ముఖ్యం టెక్నాలజీలో మంచి చెడు రెండు ఉన్నాయి.
యువత చాలామంది చెడుకు బానిసలు అవుతున్నారు తల్లిదండ్రులు తప్పక పిల్లల యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియపరచాలి వారిని పిలిచి ఎస్సైలు సీఐలు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది యువత చెడుకు బానిస అయ్యి మద్యాంతరంగా ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం.
అధికారుల ఫోటోలు డిపి పంపించి ఆపదలో ఉన్నాము ఆసుపత్రులలో ఉన్నాము రోడ్డు యాక్సిడెంట్లు అయ్యాయి అత్యవసరంగా డబ్బులు పంపించమని ఎవరైనా మెసేజ్లు పంపిస్తే వాటిపై నిర్ధారణకు వచ్చేంతవరకు డబ్బులు పంపించవద్దు.
సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త.
సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930. డయల్ 100.లకు తక్షణమే కాల్ చేయండి.
ఆశ,భయము అనే పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి.
మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి ఫ్రీగా డబ్బులు ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ ఇవ్వరు ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి.
సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు. వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
యాప్స్ లలో ఆర్మీ సోల్జర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.
ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి.
సైబర్ నేరాలలో దురదృష్టవశాస్తూ ఎవరైనా లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ పోగొట్టుకుంటే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పి తదుపరి సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712665862 సమాచారం అందించాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎసిపి, ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభిస్తారు.
లక్ష రూపాయల కంటే తక్కువ పోగొట్టుకున్న వారు కేంద్ర సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి వివరాలు పొందుపరిచి తదుపరి సంబంధిత పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వాలి.
========================
60ప్రభుత్వ రేషన్ బియ్యం పిడిస్ రైస్ డంపు పట్టుకున్న సిద్దిపేట టాస్క్ఫోర్స్ – కోహెడ పోలీసులు..

కోహెడ

కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో, గంట ఎల్లవ్వ, గంటఎల్లమ్మ, గంట బుచ్చమ్మ,ముగ్గురు కలసి కోహెడ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, ఎక్కువ రేటుకు అమ్ముదామని అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ రేషన్ బియ్యం డంపు చేసి పెట్టినారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది కోహెడ ఎస్ఐ తిరుపతి, సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు.
కోహెడ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గ్రామాలలో,పట్టణాలలో ఇసుక అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445. 8712667446. 8712667447. లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *