Jogu Premendar: పండర్‌పూర్‌ను సందర్శించిన జోగు ప్రేమేందర్‌

సిరా న్యూస్, డిజిటల్‌:

పండర్‌పూర్‌ను సందర్శించిన జోగు ప్రేమేందర్‌

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ తన పుట్టిన రోజును పురస్కరించుకొని మహారాష్ట్రలోని పండర్‌పూర్, తుల్జాపూర్‌ ఆలయాలను సందర్శించారు. గురువారం ఆయన తన తండ్రి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్‌లతో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని అన్నారు. ప్రతీ ఒక్కరు భక్తి భావనను పెంపొందించుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *