సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా గెరిగేంట్ పల్లిలో దారుణం జరిగింది. కల్లు వ్యాపారి ఓ వ్యక్తిని కర్రతో వాతలు వచ్చేలా కొట్టి తలపై తీవ్రం దాడి చేసాడు. కల్లు ధర అమాంతం ఐదు రూపాయలు ఎలా పెంచుతరని అడగడమే దాడికి పాల్పడ్డారని బాధితుడు శ్రీనివాస్ ఆరోపించాడు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెరిగేంట్ పల్లి లో పది రూపాయలు ఉన్న కల్లు సీసా ధర రూ.పదిహేను కు వ్యాపారి దత్తాత్రేయ గౌడ్ పెంచాడు. కల్లు సేవించి ధరపై ప్రశ్నించిన శ్రీనివాస్… కల్లు వ్యాపారి దత్తాత్రేయ గౌడ్ వాగ్వివాదం జరిగింది. దత్తాత్రేయ గౌడ్ అనుచరులతో కలిసి శ్రీనివాస్ మరో వ్యక్తిపై దాడి జరిపారు. శ్రీనివాస్ కు తలపై… వొంటిపై తీవ్రంగా గాయాలు అయ్యాయి. కులం పేరుతో దూషించి దాడిచేశారని వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు
===========================