సిరా న్యూస్,షాద్ నగర్;
ఆస్ట్రేలియా లో దారుణం జరిగింది. షాద్ నగర్ కి చెందిన అరటి అరవింద్ యాదవ్ అనుమానాస్పద మృతి చెందాడు. ఆరవింద్ 5 రోజుల క్రితం అదృశ్యమైయాడు. చివరకు అరవింద్ సముద్రంలో శవమై తేలాడు. సిడ్నీ లోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో అరవింద్ కారును పోలీసులు గుర్తించారు. లభించిన ఆధారాలతో చనిపోయింది అరవింద్ గా గుర్తించారు. మృతుడు ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్లుగా సిడ్నీ లో స్థిరపడ్డడు. అరవింద్ ది హత్య.. ఆత్మహత్య.. అనేది విచారణ జరుపుతున్నారు. అరవింద్ కు 18 నెలల క్రితమే అరవింద్ కి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. తల్లి ఆరు రోజుల క్రితం ఇండియా కి తిరిగి వచ్చింది.