పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం

-తమకున్న తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తాం

-మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి

సిరా న్యూస్,మంథని;

మంథని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం మంథని మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు సంబంధించిన పలు సమస్యలను మున్సిపల్ చైర్మన్ రమా సురేష్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. తమ సిబ్బందితో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేట , గొల్లగూడెం కు సంబంధించిన ప్రాంతాల్లో బలవీర హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి ఎకో పార్క్ వరకు గల రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ పొదలతో కూడిన చెట్లు ఉండి ఆ ప్రాంత వాసులకు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఈరోజు ఉదయం ఆ ప్రాంతాలను పరిశీలించి వెంటనే జె సి బి సహాయంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను దగ్గరుండి తొలగించారు. అదేవిధంగా మున్సిపల్ ఏరియాకు సమీపంలో డ్రైనేజీలు పూర్తి అస్తవ్యస్తంగా ఉండడంతో తమ సిబ్బందిని ఉపయోగించి గత కొద్ది రోజులుగా పేరుకుపోయిన చెత్తా చెదారాలను శుభ్రం చేయించారు. వెనువెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ మాట్లాడుతూ తమకున్న తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలను మంథని ప్రజలకు అందించడం కోసం తాము తమ పాలకవర్గం మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *