AO Nagarjuna: ఫర్టిలైజర్ షాపుల‌ను తనిఖీ చేసిన ఏవో నాగార్జున‌

సిరా న్యూస్, ఓదెల
ఫర్టిలైజర్ షాపుల‌ను తనిఖీ చేసిన ఏవో నాగార్జున‌

ఓదెల మండలంలోని పోత్కపల్లి, ఓదెల గ్రామాల్లోని ఫర్టిలైజర్స్ షాపులో శుక్రవారం ఓదెల మండల వ్యవసాయ అధికారి నాగార్జున తనిఖీ చేప‌ట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విత్తనాల స్టాకును, స్టాక్ రిపోర్ట్, రికార్డులను ఆయన పరిశీలించారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి స్టాక్ బోర్డ్ పై లైసెన్స్ నెంబర్, ఇంటి నెంబర్ తప్పకుండా ఉండాలని ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు అమ్మాలని ఆయన అన్నారు. ఆయ‌న‌ వెంట పోత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *