సిరాన్యూస్, ఖానాపూర్
దాసరి గంగుకు రక్తదానం చేసిన యువకులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శివాజీ నగర్ కాలనీకి చెందిన దాసరి శ్రీనివాస్ తల్లి దాసరి గంగు నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో గత ఆరు నెలల నుండి అనారోగ్యంతో చికిత్స పొందుతుంది. ఆమెకు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడింది. అక్కడ ఉన్న బ్లడ్ బ్యాంకులో రక్తం అందుబాటులో లేకపోవడంతో ఖానాపూర్ కు చెందిన తుమ్మనపల్లి సాంకేత్, కొండా సురేష్ లకు ఈ విషయం తెలియజేశారు. వెంటనే వారు వెళ్లి రక్తదానం చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. ఈసందర్బంగా రక్తదాతలను ప్రజలు ఆరోగ్య విభాగ సిబ్బంది అభినందించారు.