సిరాన్యూస్, కుందుర్పి
కుందుర్పిలో కిరాణా దుకాణాలు తనిఖీ
అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంతో పాటు గ్రామాలలోని కిరాణా దుకాణాలను శుక్రవారం తహసీల్దార్ బి. హనుమంతు, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జూన్ 6 వ తేది వరకు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున దుకాణాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టపాసులు, పెట్రోల్ అమ్మకూడదని నిబంధనల మేరకు పలు దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. చట్టాన్ని ఎవరైనా ధిక్కరిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని ఎస్ఐ, తహసీల్లార్ హెచ్చరించారు.