సిరాన్యూస్, ఖానాపూర్టౌన్
బాలుడి చికిత్స కోసం రూ.10వేలు అందజేసిన అల్లాడి శోభ వేణు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన పస్పుల మీన కుమారుడు సిద్దు (13) అనే బాలుడికి బ్రెన్ ట్యూమర్ వ్యాధి సంభవించింది. బాలుడి శాస్త్ర చికిత్సకు రూ.3 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీరామ్ నగర్ కాలానికి చెందిన అల్లాడి శోభ – వేణు (శోభ కిడ్స్ వేర్) దంపతులు తమ వంతు సహాయంగా రూ. 10,000 అందజేశారు.ఇంకెవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా వారు కోరారు.