ట్రాఫిక్ పోలీసులకు ఎండ వేడిమి నివారించే పర్సనల్ కిట్స్ ను అందించిన జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత,

సిరా న్యూస్,భీమవరం;
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత జిల్లాలోని ట్రాఫిక్ పోలీసులకు ఎండ కాలంలో ట్రాఫిక్ పాయింట్లలో నిలబడి విధులు నిర్వహించడం కష్టంగా ఉంటుంది. వారికి కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు ఎండ వేడిని తగ్గించే విధంగా ఉండేందుకు ఎండ వేడిని నివారించే పర్సనల్ కిట్స్ లను ఈ రోజు ఎస్పీ గారు స్వయంగా ట్రాఫిక్ పోలీసులకు అందజేయడం జరిగింది. పర్సనల్ కిట్స్ ద్వారా ఈ క్రింది వస్తువుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….వాహనదారులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేకుంటే మోటారు వాహనాలు చట్టం 2019 ప్రకారం జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని తెలియజేశారు. తాగి వాహనం నడిపితే పాత చట్టం ప్రకారం 2000 రూపాయలు జరిమానా విధించబడేది అయితే ఇప్పుడు సవరించిన కొత్త చట్టం ప్రకారం 10,000 రూపాయలు జరిమానాగా విధించబడుతుంది. సీట్ బెల్ట్ వాడకుండా వాహనం నడిపితే పాత చట్టం ప్రకారం 100 రూపాయలు జరిమానా విధించబడేది అయితే ఇప్పుడు సవరించిన కొత్త చట్టం ప్రకారం 1000 రూపాయలు జరిమానాగా విధించబడుతుంది.

👉హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే పాత చట్టం ప్రకారం 1000 రూపాయలు జరిమానా విధించబడేది అయితే ఇప్పుడు సవరించిన కొత్త చట్టం ప్రకారం 1000 రూపాయలు జరిమానాతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ ను రద్దు చేయడం జరుగుతుంది. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే పాత చట్టం ప్రకారం 1000 రూపాయలు జరిమానా విధించబడేది అయితే ఇప్పుడు సవరించిన కొత్త చట్టం ప్రకారం 5000 రూపాయలు జరిమానాగా విధించబడుతుంది. కాబట్టి జిల్లా ప్రజలు మోటార్ వాహనాలు చట్టం-2019 పై అవగాహన కలిగి ఉండి, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, జిల్లా ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు , పశ్చిమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీ (ఎస్సీబీ) ఎ.టి.వి రవికుమార్ , భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ వి.నారాయణ స్వామి రెడ్డిఇతర పోలిసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *