Jogu Ramanna: హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి జోగు రామన్న‌

సిరాన్యూస్‌, ఆదిలాబాద్
హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి జోగు రామన్న‌

ఆదిలాబాద్ పట్టణంలోని రైతు బజార్ హనుమాన్ మందిరం నుండి చేపట్టిన హనుమాన్ శోభాయాత్రను శ‌నివారం మాజీ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. పట్టణంలోని పురవీధుల గుండా శోభయాత్రను హనుమాన్ భక్తులు కొనసాగించారు. ఈసంద‌ర్భంగా మాజీమంత్రి జోగు రామన్న హనుమాన్ పల్లకిని భుజాలపై మోస్తూ ముందుకు సాగారు. హనుమాన్ భక్తుల నృత్యాలు,భజన సంకీర్తనలతో పురవీధులు మారుమోగాయి. శోభయాత్రలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *