రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

సిరా న్యూస్,డోన్;
నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిలోని ఉంగరానిగుండ్ల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జోరు వర్షంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురు యువకులని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో ముని, ప్రభాకర్, దశరథ అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి హైవే పోలీసులు తరలించారు.ముని ,ప్రభాకర్ అనే యువకులు తుగ్గలి మండలం లింగనేని దొడ్డి గ్రామానికి చెందిన వారుగా, దశరథ అనే యువకుడు డోన్ మండలం చనుగొండ్ల వాసిగా పోలీసులు గుర్తించారు.మృతులు పెయింటర్ పని నిమిత్తం డోన్ కు వచ్చి తిరిగి గ్రామానికి వర్షంలో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *