పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

సిరా న్యూస్,న్యూఢిల్లీ;
: పార్లమెంట్ ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం ఉదయం నుంచి కొనసాగుతోంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 58 లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్, హర్యానా సిఎం నాయబ్ సింగ్ సైనీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, లోక్ సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్, ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, మాజీ సిఇసి సుశీల్ చంద్ర, తదితరలు తమ ఓటు హక్కును వినియోగించుకన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *