సిరా న్యూస్, ఓదెల
నేత్రదాతకు సంస్మరణ సభ
* హాజరైన సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మరణించి నేత్ర దానం చేసిన తాటికొండ లక్ష్మి సంస్మరణ సభను సోమవారం లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాలులో సదాశయ ఫౌండేషన్ ఓదెల మండల అధ్యక్షుడు డాక్టర్ కోండ్ర వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ హాజరై నేత్ర, అవయవ,శరీర దానాలపై అవగాహన కల్పించారు.మరో అతిథిగా హాజరైన మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ సదాశయ ఫౌండేషన్ జ్ఞాపికను కుటుంబ సభ్యులు మొండయ్య-అనసూయలకు అందజేసి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కృష్ణ వేణి-ఆదినారాయణ, లావణ్య -కృష్ణ, సరిత -శ్రీనివాస్, కార్తీక్ -ఝాన్సి, మనుమలు, మనుమరాండ్లు, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ వేణు, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు,.అల్లం సతీష్, క్యాతం మల్లేశం,బాలసాని సంతోష్, భారత్ గ్యాస్ సత్యనారాయణ, నవీన్, వినోద్, క్యాతం ప్రసాద్, మిణుగు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.