సిరా న్యూస్, ఆదిలాబాద్
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి: రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులల్లో మహారాష్ట్ర ఉండడం తో నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉండడంతో రైతులు ఆ విత్తనాలు తీసుకొని నష్టపోయే పరిస్థితి దాపురిస్తుందని తెలిపారు. దీనిపైన జిల్లా కలెక్టర్,వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్ టాస్క్ పోర్స్ అధికారులు కలిసి నకిలీ విత్తనాలు అమ్ముకునే వారిపైన దృష్టి సారించాలని కోరారు. నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నా వారి పైన పీడీ యాక్ట్ను నమోదు చేయాలన్నారు.వారికున్నటు విత్తన డీలర్ లైసెన్స్ ను రద్దు చేయవలిసిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దూర దృష్టితో అలోచించి రైతులకు సర్టిఫాయిడ్ చేసిన విత్తనాలను అందించినట్లయితే ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. మరొక పక్క మార్కెట్ లో మాయాజాలం, కృత్తిమ కొరత సృష్టిస్తున్నారని తెలిపారు. స్థానిక రైతులకి పత్తి విత్తనాలు ఇవ్వకుండా పక్కన ఉన్న మహారాష్ట్ర రైతులకు విత్తనాలను ఇస్తున్నారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విత్తన రాయితీ చట్టాన్ని అములు చేసేవిదంగా కృషి చేయవలిసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రైతులు , రైతు సంఘ నాయకులు డి వెంకటనారాయణ, ఏఐకేఎంఎస్ చిలుక దేవిదాస్, ఏఐకేఎస్,జగన్ ఏఐపీకేఎస్ సురేష్, తదితర జిల్లా నాయకులు పాల్గొన్నారు.