సిరా న్యూస్,ఆదిలాబాద్
ఆదిలాబాద్ న్యాయవాది సుధీర్ కుమార్కు అరుదైన ఆహ్వానం
నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి సందర్బంగా ఈ నెల 28న రాష్ట్ర రాజధానిలోని త్యాగరాయ గాన సభలో ప్రముఖులకు నందమూరి తారక రామారావు అవార్డుతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఆదిలాబాద్ జిల్లా న్యాయవాది సుధీర్ కుమార్ సంగెంకు ఆహ్వానం అందించారు. ఈ ఆహ్వానం అందడం జిల్లా ప్రజలకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రముఖ మహా రథులు, తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ వాకులాభారణం కృష్ణ మోహన్ , సత్య సంగీత అధ్యక్షులు ఓంకార్ రాజు, సినీ తారలు పూజిత, అర్చన,నోరా, జయసుధ తమ్ముడు రాంకీ తదితరుల తో కలిసి నందమూరి తారకరామారావు అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ ఆహ్వానం అందడం తన బాధ్యత మరింత పెంచిందని పేర్కొన్నారు.