సిరాన్యూస్,ఉట్నూర్
సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* పెర్సపెన్ లకు ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ సోయం బాపురావు
ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని సాకడ గ్రామంలో ‘భావె మహినా’ సందర్బంగా సోయం పరివార్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పెర్సపెన్ లకు ఎమ్మెల్యే, ఎంపీ సోయం బాపురావుతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీలు ప్రకృతిని దైవంగా భావించి ఎంతో నియమ నిష్టలతో పూజలు చేసి తమ సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. నేటి యువత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. తరతరాలుగా ఆచరిస్తున్న వస్తున్న సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఆదివాసీపై ఎంతైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, సోయం కుటుంబ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.