సిరా న్యూస్, బోథ్
బోథ్లో జోరుగా ఇసుక జీరో వ్యాపారం
* పట్టించుకోని సంబంధిత అధికారులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఇసుక జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నది. జీరో వ్యాపారం కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంగా కొంతమంది వ్యాపారులు బోథ్ ప్రాంతానికి గుట్టు చప్పుడు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు తీసుకొని తరలిస్తున్నారు. సోమవారం నిర్మల్ ప్రాంతానికి చెందిన ఇసుక వ్యాపారి కనుగుట్ట గ్రామానికి దాదాపు 60 టన్నుల ఇసుకను జీరోలో తరలించారు. అయితే స్థానిక ఇసుక వ్యాపారులు జీరో ఇసుక వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తేదీ ఏమైనా ప్రభుత్వాదానికి గండి కొట్టి జీరోలా ఇసుక తరుముతున్న మైనింగ్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.