సిరాన్యూస్, గుడిహత్నూర్
పాఠశాలకు విరాళం అందించిన మాజీ మార్కెట్ చైర్మన్ ఆడే శీలా
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో చేపట్టిన ప్రహరీ గోడ, టాయిలెట్స్ నిర్మాణ నిమిత్తం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ ఆడే శీలా తన వంతు సహాయంగా 20 సిమెంట్ బస్థాలను అందజేశారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యాల కోసం తన వంతుగా సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్బంగా పాఠశాల సమితి కార్యదర్శి అంకతి రవీందర్ , మంగనాలే బాలాజీ ఆడే శీలాకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గిత్తే భరత్, గిత్తే తరుణ్ తదితరులు ఉన్నారు.