సిరాన్యూస్, నేరడిగొండ
సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రాజురా గ్రామం వద్ద నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యామును అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టి పనులను ప్రారంభించాలని ఆదేశించారు.చెక్ డ్యాములో ప్రతీ ఒక్కటి నాణ్యమైన సామాగ్రి తో నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం రాజురా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.