Janardhan Rao: గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: డీఈఓ జనార్దన్ రావు

సిరాన్యూస్‌, చిగురుమామిడి
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: డీఈఓ జనార్దన్ రావు
* పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న ప‌నుల ప‌రిశీల‌న

ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కరీంనగర్ విద్యాధికారి జనార్దన్ రావు అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను కరీంనగర్ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు ఎంఈఓ శ్రీనివాసరెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 2024 -2025 విద్య సంవత్సరానికి సంబంధించిన అన్ని పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పావని, తిరుపతి,ఎంపీపీఎస్ ఇప్పలపల్లి ఉపాధ్యాయులు గంప చంద్రశేఖర్, బొమ్మనపల్లి ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *