సిరాన్యూస్, బోథ్
బోథ్ మార్కెట్లో మహారాష్ట్ర రైతు జొన్నలు
* బినామీలుగా స్థానిక రైతులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డులో జొన్న పంట కొనుగోలు ప్రారంభం అయిన నాటి నుండి రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది ప్రైవేట్ వ్యాపారులు మార్క్ఫెడ్ జొన్న పంట కొనుగోలు కాకముందు 2000 రూపాయలకే క్వింటాలుగా కొనుగోలు చేశారు అయితే ఇటీవల మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పంట కొనుగోలు ప్రారంభం కావడంతో 3180 రూపాయలకు క్వింటాలుగా కొనుగోలు చేశారు. అయితే ఈనెల 31న జొన్నాల కొనుగోలు చివరి తేదీగా మార్క్ఫెడ్ అధికారులు ప్రకటించడంతో భారీగా మహారాష్ట్ర నుండి జొన్న పంట తరలివస్తున్నది. బోథ్ మండలం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడం వల్ల మహారాష్ట్ర రైతులు కొంతమంది వ్యాపారులు స్థానికంగా ఉన్న రైతుల పేరు పైన పంటను విక్రయిస్తున్నారు. దీంతో గత రెండు రోజుల నుండి మహారాష్ట్ర వ్యాపారుల రైతుల జొన్నలు మార్కెట్లో ముంచేస్తున్నాయి. కొంతమంది పెద్ద రైతులు మహారాష్ట్ర వ్యాపారుల నుండి కొనుగోలు చేసి పంటను విక్రయిస్తున్నారని తెలిసింది. కాగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సివిని ప్రాంతం నుండి భారీగా జొన్న పంట వస్తుందని, అధికారులు చెక్పోస్ట్ ఏర్పాటు చేసినట్లయితే స్థానిక రైతులకు న్యాయం జరిగే ఆస్కారం ఉంది. కాగా మార్కెట్ యార్డులో సిబ్బంది లేకపోవడం వల్ల చెక్పోస్ట్ ఏర్పాటు సాధ్యం కాదని మార్కెటింగ్ అధికారులు పేర్కొంటున్నారు.