Vijaya Ramana Rao:ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

సిరాన్యూస్, ఓదెల
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
* ఓదెలలో ఘ‌నంగా ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవం

ఎల్లమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవం మంగళవారం రాత్రి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘ‌నంగా నిర్వహించారు. ఈసంద‌ర్బంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు బోనాల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బోనం ఎత్తుకొని అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి చిన్న స్వామి, బండారి కుమారస్వామి, అల్లం సతీష్ తీర్థాల వీరన్న, పొత్క పల్లి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, గోపగోని సారయ్య గౌడ్, ఓదెల గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, అయిలి స్వామి, కోటగిరి స్వామి, మార్కా సతీష్ , సదానందం, పరశురాం, రవికుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *