సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
వారసంతను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రెండవ వారం పాత అంగడి బజార్ మార్కెట్లో కొనసాగుతున్న వారసంత రగాయల మార్కెట్ ను బుధవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ విజయవంతంగా రెండవ వారం పాత అంగడి బజార్ మార్కెట్లో వారసంత నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి సహకరించిన ప్రతి ఒక కూరగాయల, చిరు వ్యాపారస్తులకు, ప్రజలకు, మున్సిపాలిటీ అధికారులు సిబ్బందికి, పోలీస్ అధికారులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్ నాయకులు జన్నరపూ శంకర్ , పరిమి సురేష్ , అమనూల్ల ఖాన్ ,కిషోర్ నాయక్ ,మాజీ వైస్ చైర్మన్ అబ్ధుల్ కలిల్ , షబ్బీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.