-మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
సిరా న్యూస్,వేములవాడ;
దాతల సహకారంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1128 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజన్న ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని,అన్నదాతలు సల్లగా ఉండాలని నేటి అన్నదాతలుగా కొనయిపల్లి మాజీ ఎం.పీ.టీ.సీ నరుకుల సునీత రాంకిషన్ రావు దంపతులు,బాసాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా వీరి మిత్రబృందం శాశ్వత దాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు,గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు,దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు ఉన్నారని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్,తాళ్లపల్లి ప్రశాంత్,డాక్టర్. బెజ్జంకి రవీందర్,చల్లా సత్తయ్య,పొలాస రాజేందర్,పసుల శ్రీనివాస్,గుమ్మడి కుమార్,గొండ ప్రసాద్,రాజేష్ పిట్టల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.