సిరా న్యూస్,తిరుపతి;
అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో బుధవారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది.
ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు సంకీర్తన గానం నిర్వహించారు. అనంతరం తిరిగి స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామాలయానికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ మధుసూదన్, శ్రీమతి సుశీల బృందం ” రామచంద్రుడితడు రఘువీరుడు…, జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం…, జయ జయ రామ…., రాముడు రాఘవుడు రవికులు డితడు.., తదితర సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. విభీషణ శర్మ, శ్రీ కోదండరామస్వామి ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
=========================