సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
తాగునీటి సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ పరిమి లత-సురేష్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బుధవారం ఐదవ వార్డులోని పద్మావతి నగర్ కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడింది. కాలనీవాసులు వార్డు కౌన్సిలర్ పరిమి లత- సురేష్ కు నీటి సమస్య గురించి చెప్పగానే తక్షణమే స్పందించి మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మున్సిపల్ చైర్మన్ పద్మావతి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మోటార్కు కనెక్షన్ ఏర్పాటు చేసి ప్రజల నీటి సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా గంగపుత్ర కాలనీలో మోటర్ కాలిపోవడంతో మున్సిపల్ సిబ్బందిని పిలిపించి మున్సిపల్ చైర్మన్ చొరవతో వార్డు కౌన్సిలర్ పరిమి లత-సురేష్ దగ్గరుండి మరమ్మతులు చేయించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ కు కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు.