సిరాన్యూస్ , కోనరావుపేట
ఎల్ఓసీ మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన టి.సత్తవ్వ అనారోగ్యానికి గురైంది. అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలియజేయగానే తక్షణమే స్పందించి(ఎల్ఓసి)నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రత్యేకమైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 2,50,000/- రూపాయలు మంజూరు చేయించారు. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కి కుటుంబ సభ్యులు, ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.