kandi Srinivasa Reddy: ప్రజా పాలనను ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయి : కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్  కంది శ్రీనివాస రెడ్డి

సిరాన్యూస్ , ఆదిలాబాద్‌
ప్రజా పాలనను ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయి : కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్  కంది శ్రీనివాస రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నయ‌ని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గురువారం ప్రజా సేవ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. ప్రజల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది అని అన్నారు.మత్తడి వాగు ,సోన్కాస్ లక్ష్మీపూర్ ,సాత్నాల ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రతిపక్షాలు విత్తన రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆరోపణలు తప్పని రుజువైందన్నారు.రైతులు ఒకే రకమైన రాశి 659 రకం కోరుకోవడం తోనే రద్దీ అని, కచ్చితంగా రైతుల కోరుకునే రకం పూర్తిగా అందుబాటులోకి వస్తుందన్నారు.ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు.మార్కెట్లో అనేక రకమైన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.పోలీసులు రైతులను సరైన పద్ధతిలో క్రమబద్దీకరిస్తున్నారు.ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా డ్యూటీ చేస్తున్నారు.నకిలీ విత్తనాలు నకిలీ మందులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.అలాంటి వారిపై పిడియాక్టులు పెట్టి అణిచివేస్తాం అని అన్నారు.పోలీసులు మైనింగ్ శాఖ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.పాయల్ శంకర్ తనయుడు జోగు రామన్న తనయుల పై ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు వస్తున్నాయ‌ని అన్నారు.నీచ రాజకీయాలు చేసేది మీరు.నాపై వ్యక్తిగత ఆరోపణలు చేయిస్తున్న పాయల శంకర్ కు సరైన సమాధానం చెప్పాలన్నారు.నాపై చేసిన ఆరోపణలకు సవాలుకు నేను సిద్ధం అని అన్నారు.పాయల్ శంకర్ అక్రమాలు త్వరలో బట్టబయలవుతాయి. త్వరలో పాయల శంకర్ కు రాజకీయ సమాధి తప్పదని హెచ్చ‌రించారు. నకిలీ విత్తనాలపై ఎంత పెద్ద వారైనా కానీ వదిలేది లేదు అని అన్నారు. సమావేశంలో మావల ఎంపీపీ దర్శనాల సంగీత – ఏవన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావ్, శ్రీలేఖ ఆదివాసీ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, పిప్పర్ వాడ ఎంపీటీసీ ముడుపు ప్రశాంత్ రెడ్డి, కౌన్సిలర్లు సాయి ప్రణయ్, జాఫర్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,నాయకులు బండి దేవిదాస్ చారి, యెల్టీ భోజా రెడ్డి, భరత్ వాగ్మారే, పోరెడ్డి కిషన్, మునిగేల విట్టల్, కందుల సుకేందర్, విలాస్ సవాపురే, మొహమ్మద్ రఫీక్, కయ్యుమ్, వసంత్, మహేందర్, సమీ ఉల్లా ఖాన్, అశోక్ ప‌లువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *