Rajarshi Shah: జూన్ 9 న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష : క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరాన్యూస్ , ఆదిలాబాద్‌
జూన్ 9 న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష : క‌లెక్ట‌ర్ రాజర్షి షా
* పరీక్ష అన్ని ఏర్పాట్లు చేయాలి
* మాల్ ప్రాక్టీస్ జరుగకుండా చర్యలు తీసుకోవాలి

గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ రాజర్షి షా అన్నారు. జూన్ 9 న నిర్వహించనున్న తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ ) గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షల ఏర్పాట్ల పై జిల్లా పాలనాధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తో కలసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కు అన్ని ఏర్పాట్లు చేయాలని, పకడ్బంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా చర్యలు తీసుకోవాలని, గ్రూప్ 1 పరీక్ష ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్ష వ్రాసే అభ్యర్థులు ఉదయం 9.00 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9.30 గంటలకు బయోమెట్రిక్ హాజరు మొదలవుతుందని ఆన్నారు. పరీక్ష ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించాలని పేర్కొన్నారు. తగిన నిఘా వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. సెల్ఫోన్లతోపాటు ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆదేశించారు. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కు 18 కేంద్రాలను, రీజనల్ సెంటర్ 1 ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 6, 729 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరుకానున్నారని, ఇందుకు సంబంధించి రూట్ ఆఫీసర్లు 5 గురు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ లు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, తదితర సిబ్బందిని నియమించడం జరిగిందని, 144 సెక్షన్ అమలు, స్ట్రాంగ్ రూమ్, సెక్యూరిటి, పరీక్షా కేంద్రం లో ఆన్ని మౌళిక వసతుల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలిపారు.అభ్యర్ధులు సకాలం లో పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు బస్ సౌకర్యం కల్పించాలని, ఆరోజు అభ్యర్థుల కొరకు ప్రత్యేక బస్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో అంతరాయం లేకుండా విద్యుత్ ను అందించాలని, వైద్య సిబ్బంది మెడికల్ కిట్ తో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కు అరగంట ముందే గేట్లు మూసివేయడం జరుగుతుందని, జూన్‌ 9 న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించడం, 10 గంటలు దాటితే లోనికి అనుమతి లేదని అన్నారు. ఉదయం 9.30 నుంచి అభ్యర్థుల బయోమెట్రిక్ ఉంటుంద‌ని, పరీక్ష ప్రారంభానికి ముందుగానే అభ్యర్థులకు ఓఎంఆర్‌ షీట్లను ఇస్తారని, బుక్‌లెట్‌లను 10.30కు బెల్‌ మోగిన తర్వాతే తెరవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మహిళా పోలీస్ సిబ్బందిని నియమించడం, అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్లు, పేపర్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు, చేతిగడియారం, ఎక్కాల పుస్తకం, లాగరిథమ్‌ పుస్తకం, పర్సు, హ్యాండ్‌బ్యాగ్‌, రైటింగ్‌ పాడ్స్‌, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రికార్డింగ్‌ పరికరాలకు అనుమతి ఉండదని, అభ్యర్థులు బూట్లను ధరించి పరీక్షకు రాకూడదు. చెప్పులను మాత్రమే ధరించాల‌ని, అభ్యర్థులు చేతులకు మెహిందీ, తాత్కాలిక టాటూస్ ను వేసుకోకూడదని సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బెల్‌ మోగించి లేదా ఇన్విజిలేటర్‌ ద్వారా సమయాన్ని చెబుతారు. గ్రూపు-1 పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు, శనివారం(జూన్‌ 1) నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. గతంతో పోలిస్తే పరీక్ష నిర్వహణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని, పరీక్ష నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *