సింగరేణి గనిలో ప్రమాదం

కార్మికుడు మృతి
 సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ గనిలో జరిగిన ప్రమాదంలో ఎల్.హెచ్. డీ ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ దుర్మరణం పాలయ్యాడు. రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన ప్రతాప్ నిన్న రాత్రి షిఫ్ట్ విధులకు హాజరయ్యారు. ఎల్ హెచ్ డీ మిషన్ పై కోల్ కటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో తనపై ఎల్ హెచ్ డి మిషన్ పడింది. ఈ సంఘటనలో మిషన్ పత్రాప్ పై పడడంతో అక్కడికక్కడే మరణించాడు. వెంటనే మృతదేహాన్ని గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని కార్మిక నేతలు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *