సిరా న్యూస్,షాద్ నగర్;
షాద్ నగర్ లో డిగ్రీ విద్యార్థిని మానస మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముమ్మాటికి హత్య అంటున్న కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పోలీసుల అదుపులో నిందితుడు రాములు వున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మానస పై దాడికి పాల్పడి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హత్య చేసి మరి ఏమి తెలియనట్టు మా అందరితో కలిసి తిరిగాడు నిండితుడు రాములు అని వాపోయిన కుటుంబ సభ్యులు
రంగారెడ్డి జిల్లా ఫరుక్ నగర్ మండలంలోని కందివనం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి
కందివన గ్రామానికి చెందిన లక్ష్మమ్మ నరసింహ కూతురు అయినటువంటి మానస షాద్ నగర్ పట్టణంలో గో ప్రైవేట్ పాఠశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నది. వివరాల్లోకి వెళితే మానస కుటుంబ సభ్యులందరూ వేరే గ్రామంలో వారి బంధువుల యొక్క చావు కార్యక్రమానికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో అదును చూసి నిందితుడు రాములు మానసపై బలాత్కారానికి పాల్పడి హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు పోలీసులు దీనిపై కేసును తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
======================